Breaking News

జీవిత కాలం ఆలస్యం.. వందేళ్ల తర్వాత ఆలస్యంగా అందిన ఓ లేఖ!


పోస్ట్ ద్వారా పంపిన ఉత్తరాలు, లేఖలు అందడంలో జాప్యం తెలుసు..కానీ, ఇది వారం పది రోజులు ఉంటుంది. అయితే, ఓ లేఖ మాత్రం వందేళ్ల తర్వాత చిరునామాకు చేరడం జీవిత కాలం ఆలస్యం అనే మాటకు ఈ తోకలేని పిట్టను ఉదాహరణగా నిలిచింది. వందేళ్ల కిందట పంపిన ఓ ఉత్తరం గత మంగళవారం ఓ మెయిల్‌లో ప్రత్యక్షమైంది. మిచిగాన్‌కు చెందిన బ్రిట్టనీ కీచ్‌ అనే మహిళ మెయిల్‌ చెక్‌ చేస్తుండగా ఒక పోస్ట్‌కార్డు దర్శనమిచ్చింది. జార్జ్ వాషింగ్టన్ పేరున్న ఒక్క సెంట్ స్టాంప్‌పై 1920 అక్టోబరు 29 తేదీ చూసి విస్మయానికి గురయ్యింది. కీచ్ ప్రస్తుతం ఉంటున్న నివాస చిరునామా రాయ్‌ మెక్‌ క్వీన్‌ అనే పేరు ఆ కార్డుపై రాసి ఉంది. దానిపై ఉన్న పోస్టల్‌ స్టాంపు ద్వారా అది జేమ్స్‌టౌన్‌ నుంచి పోస్ట్‌ చేసినట్లుగా తెలుస్తోందని కీచ్‌ తెలిపారు. తాత, బామ్మలకు తమ విషయాలను తెలుపుతూ రాసిన ఆ కార్డు కింద ప్లోసీ బర్గెస్‌ అని సంతకం చేసి ఉందని.. చీపురు పట్టుకున్న పిల్లి, మంత్రగత్తె బొమ్మలు వేసి ఉన్నాయని ఆమె వివరించారు. దాన్ని చదవడం మొదలుపెట్టగా అందులో పదాలు తనకు కన్నీళ్లు తెప్పించాయని అన్నారు. ఈ లేఖ ఆయన సంబంధీకులకు చేరాలనే తపనతో సోషల్‌ మీడియాలో పెట్టామని, ఒకరిని బర్గెస్‌ బంధువుగా భావిస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటికే ఈ లేఖను చాలా మంది షేర్ చేశారు. మీ అందరూ బాగుంటారని ఆశిస్తున్నాను. మేము బాగానే ఉన్నాం... కానీ అమ్మకు మోకాళ్ల నొప్పులు భయంకరంగా ఉన్నాయి. ఇక్కడ చలి విపరీతంగా ఉంది. నేను నా చరిత్ర పాఠాన్ని ముగించి చాలా త్వరగా పడుకోబోతున్నాను. నాన్న షేవింగ్ చేసుకుంటున్నారు.. అమ్మ మీ చిరునామా నాకు చెబుతోంది. రాత్రి బాగాపొద్దుపోయింది... బామ్మ, తాత బాగానే ఉన్నారని ఆశిస్తున్నాను. లేఖ అందిన తర్వాత జవాబు ఇవ్వడం మర్చిపోవద్దు’ అని రాసి కింద ఫ్లోసీ బర్గెస్ పేరుతో సంతకం చేశాడు. అయితే, చారిత్రక వస్తువులను కొనుగోలు చేసే కొందరు.. వాటిని సంబంధీకులకు చేర్చడానికి ఇలా చేస్తుంటారని పోస్టల్‌శాఖ పేర్కొంది.


By September 14, 2020 at 07:59AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/one-cent-post-card-stamped-in-29th-october-1920-delivered-100-years-later-in-us/articleshow/78097566.cms

No comments