Breaking News

సీఏఏ అల్లర్ల కేసు: ఛార్జ్‌షీట్‌లో ఏచూరి, యోగేంద్ర యాదవ్ పేర్లు లేవు.. ఢిల్లీ పోలీసులు


ఢిల్లీలో పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) వ్యతిరేక ఆందోళనల్లో ఘర్షణలు చెలరేగి హింసకు దారితీసిన కేసుపై పోలీసులు ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. అయితే, ఈ ఘర్షణలకు కొందరు నేతలు, ప్రొఫెసర్లు కారణమని అందులో పేర్కొవడంతో రాజకీయ దుమారం రేగుతోంది. వీరిలో సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, స్వరాజ్‌ అభియాన్‌ నేత యోగేంద్ర యాదవ్‌, ఆర్థిక వేత్త జయతీ ఘోష్‌, ఢిల్లీ యూనివర్సిటీ ఫ్రొఫెసర్‌ అపూర్వానంద్‌ల పేర్లు ఉన్నట్టు మీడియాలో ముమ్మర ప్రచారం జరిగింది. అయితే, ఈ ప్రచారాన్ని ఖండించారు. ఈ ఛార్జ్‌షీట్‌లో సీతారాం ఏచూరి, యోగేంద్ర యాదవ్ తదితరుల పేర్లు లేవని స్పష్టం చేశారు. మీడియాలో జరుగుతోన్న ప్రచారం అవాస్తమని పేర్కొన్నారు. సీఏఏకి వ్యతిరేకంగా, కేంద్రానికి చెడ్డపేరు వచ్చేలా ఆందోళనకారులను కూడగట్టి రెచ్చగొట్టారనే ఆరోపణలను వీరిపై మోపినట్టు పీటీఐ తెలిపింది. అల్లర్ల కేసుతో పాటు చట్ట వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొన్నారనే ఆరోపణలతో అరెస్టు అయిన ముగ్గురు విద్యార్థుల వాంగ్మూలాల ఆధారంగా పోలీసులు అనుబంధ అభియోగ పత్రాన్ని తయారుచేసినట్లు ‘పీటీఐ’ పేర్కొంది. డాక్యుమెంటరీ చిత్రాలు రూపొందించే రాహుల్‌ రాయ్‌, భీమ్‌ ఆర్మీ అధినేత చంద్రశేఖర్‌, ఉమర్‌ ఖలీద్‌, మాజీ ఎమ్మెల్యే మతీన్‌ అహ్మద్‌, ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్‌ పేర్లనూ ఆందోళనకారులు వెల్లడించినట్లు ఢిలీ పోలీసులు పేర్కొన్నారు. ఫిబ్రవరి 23-26 తేదీల మధ్య ఈశాన్య ఢిల్లీలో జరిగిన ఘర్షణల్లో 53 మంది ప్రాణాలు కోల్పోగా 581 మంది గాయపడ్డారు. ఛార్జ్‌షీట్‌లో తనపేరు ఉందని మీడియాలో ప్రచారం జరగడంతో సీతారాం ఏచూరి, యోగేంద్ర యాదవ్‌లు స్పందించారు. కేంద్రం, బీజేపీ నేతల ఒత్తిడి వల్లే పోలీసులు అక్రమ కేసులు బనాయించి ఉంటారని సీతారాం ఏచూరి ట్వీట్‌ చేశారు. దాడులకు కారణమైన విద్వేష ప్రసంగాలు చేసిన వారిపై విచారణ ఎందుకు జరపలేదని మరో ట్వీట్‌లో ప్రశ్నించారు. ఇక, తన ప్రసంగాలన్నీ పబ్లిక్‌ డొమైన్‌లో అందుబాటులో ఉన్నాయని, పోలీసులు వాటిని ఎందుకు ఆధారంగా పరిగణించటంలేదని యోగేంద్ర యాదవ్‌ నిలదీశారు.


By September 13, 2020 at 08:27AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/cpm-leader-sitaram-yechury-yogendra-yadav-not-charged-in-anti-caa-riots-delhi-cops/articleshow/78085172.cms

No comments