Breaking News

కొంపముంచిన కూతురి స్మార్ట్‌ఫోన్.. హైదరాబాద్‌‌లో షాకింగ్ ఘటన


హైదరాబాద్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఇన్‌స్టాగ్రామ్‌ ఫొటోలతో బెదిరించి నాలుగు లక్షలు దోచేసిన ఘటన వెలుగుచూసింది. ఫొటోలు మార్ఫింగ్ చేస్తామంటూ చేసి బాలిక నుంచి భారీగా దండుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన మేడ్చల్ జిల్లా పరధిలోని జీడిమెట్లలో చోటుచేసుకుంది. పదో తరగతి చదువుతున్న విద్యార్థినికి ఆన్‌లైన్ క్లాసుల కోసం ఆమె తల్లిదండ్రులు స్మార్ట్‌ఫోన్ కొనిచ్చారు. తరగతులు అయిపోయిన తర్వాత ఆమె ఫోన్‌కి అతుక్కుపోవడం అలవాటుగా మారింది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోలు అప్‌లోడ్ చేసేది. ఆమెను ఫాలో అయిన కేటుగాళ్లు నెమ్మదిగా పరిచయం పెంచుకున్నారు. సోషల్ మీడియా ఫ్రెండ్స్‌ని నమ్మిన బాలిక తన ఫొటోలను పంపించింది. అప్పటి నుంచి ఆమెకు వేధింపులు ప్రారంభమయ్యాయి. ఇన్‌స్టాలో పంపిన ఫొటోలను మార్ఫింగ్ చేసి అశ్లీల ఫొటోలు సోషల్ మీడియాలో పెడతామంటూ కేటుగాళ్లు బ్లాక్‌మెయిల్‌కి దిగారు. భయపడిపోయిన బాలిక వారు అడిగిన డబ్బులు ఇస్తూ వస్తోంది. సుమారు నాలుగు లక్షల రూపాయలు దోచేసిన దుర్మార్గులు ఇంకా డబ్బులు కావాలంటూ నేరుగా ఆమె ఇంటికి వెళ్లారు. ఆమె తల్లిదండ్రులు ప్రశ్నించడంతో స్టడీ మెటీరియల్ అంటూ కహానీలు చెప్పి తప్పించుకున్నారు. Also Read: అయితే ఇంట్లో ఉంచిన డబ్బులు కనిపించకపోతుండడంతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు బాలికను ఆరా తీశారు. గట్టిగా ప్రశ్నించడంతో బ్లాక్‌మెయిల్ వ్యవహారం బయటపడింది. వెంటనే బాధితురాలి తల్లిదండ్రులు జీడిమెట్ల పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు కిషోర్, ఎలీశా, రాంవికాస్‌ను నిందితులుగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. Read Also:


By September 17, 2020 at 12:13PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/class-10-girl-blackmailed-with-instagram-photos-in-hyderabads-jeedimetla-3-arrested/articleshow/78161856.cms

No comments