Breaking News

కేరళ సెక్రెటేరియట్‌లో అగ్ని ప్రమాదం.. బంగారం కేసులో కీలక ఆధారాలు నాశమయ్యాయా?


భవనంలో మంగళవారం స్వల్ప అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో కొన్ని కీలక పత్రాలు కాలి బూడిదైనట్లు అధికారులు వెల్లడించారు. అయితే ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదని తెలిపారు. సెక్రటేరియట్‌ రెండో అంతస్తులోని జనరల్‌ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్ (జీఏడీ) పొలిటికల్‌ సెక్షన్‌ నుంచి పొగలు రావడంతో సిబ్బంది అప్రమత్తమయ్యారు. మంటలను అదుపుచేసి కొన్ని పత్రాలను బయటకు తీశారు. కానీ, అప్పటికే కొన్ని అగ్నికి ఆహుతయినట్లు అధికారులు తెలిపారు. అయితే ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. స్వల్ప అగ్ని ప్రమాదమైనా.. ఈ ఘటనపై రాజకీయ దుమారం రేగుతోంది. అక్రమ బంగారం రవాణా కేసుకు సంబంధించిన కీలక ఆధారాలను నాశనం చేయడానికే ప్రభుత్వం డ్రామాలకు తెరతీసిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అక్రమ బంగారం కేసు ప్రసుత్తం ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ కార్యాలయ పరిశీలనలో ఉంది. ఈ కేసుకు సంబంధించిన వివరాలను తమకు సమర్పించాలని జీఏడీని జాతీయ దర్యాప్తు సంస్థ, కస్టమ్స్ అధికారులు ఇటీవల కోరారు. అలాగే, ఈ విభాగానికి చెందిన అసిస్టెంట్ ప్రొటోకాల్ ఆఫీసర్ సైతం ఎన్ఐఏ ముందు రెండుసార్లు హాజరయ్యారు. ప్రమాదంపై లోతుగా దర్యాప్తు చేపట్టాలని కాంగ్రెస్‌ నేతృత్వంలోని జేడీయూ డిమాండ్‌ చేసింది. ఈ క్రమంలో సెక్రటేరియట్ ఎదుట నేతలు ధర్నాకు దిగడంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు. కేరళ గవర్నర్ అరిఫ్ మొహమూద్ ఖాన్‌ను కలిసిన ప్రతిపక్ష నేత రమేశ్ చెన్నితాల.. ఇందులో జోక్యం చోసుకోవాలని కోరారు. బంగారు అక్రమ రవాణా కేసులోని అన్ని ఆధారాలను నాశనం చేసే వ్యవస్థీకృత ప్రయత్నం ఈ అగ్ని ప్రమాదం... ఎన్‌ఐఏ, ఈడీ త్వరలో సిఎంఓకు చేరుకుంటాయని తెలిసినందున ఫైళ్లు ధ్వంసమయ్యాయి’ అని విమర్శించారు. అయితే, కేసుకు సంబంధించిన ఫైల్స్‌ను ఇప్పటికే డిజిటలైజేషన్ చేశామని, పత్రాలను నాశనం చేశామనడం అర్ధరహితమని ప్రభుత్వ అధికారులు వ్యాఖ్యానించారు.


By August 26, 2020 at 07:00AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/fire-at-kerala-secretariat-bid-to-destroy-gold-case-files-says-opposition/articleshow/77753924.cms

No comments