పార్టీలో చేరిన ఐపీఎస్ ఆఫీసర్కు ఉపాధ్యక్ష పదవి.. బీజేపీ గేమ్ ప్లాన్ షురూ!

ఐదు రోజుల క్రితం పార్టీలో చేరిన ఐపీఎస్ ఆఫీసర్ కుప్పుస్వామి అన్నామలైకి తమిళనాడు ఉపాధ్యక్ష పదవి దక్కింది. ఈ విషయాన్ని తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు ఎల్ మురుగన్ ప్రకటించారు. దీంతో తమిళనాడు బీజేపీలో ఉపాధ్యక్షుల సంఖ్య 11కు చేరింది. డీఎంకేను వీడి కమలం గూటికి చేరిన దురైస్వామికి కూడా ఇటీవలే పార్టీ ఉపాధ్యక్ష పదవి దక్కింది. 2011 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన కుప్పుస్వామి కర్ణాటకలో విధులు నిర్వర్తించారు. విధి నిర్వహణలో కఠినంగా వ్యవహరించిన ఆయన్ను కర్ణాటక వాసులు సింగం అన్నా అని పిలిచేవారు. 2019లో పోలీసు ఉద్యోగానికి రాజీనామా చేసిన కుప్పుస్వామి.. సరిగ్గా ఏడాది తర్వాత బీజేపీలో చేరారు. ఆయన స్ఫూర్తితో సూర్య ‘సింగం’ సినిమా వచ్చింది. గత మంగళవారమే ఆయన బీజేపీలో చేరారు. 2021లో జరగబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మెరుగైన పనితీరు కనబర్చాలని బీజేపీ భావిస్తోంది. జయలలిత, కరుణానిధి లాంటి సీనియర్ నేతల మరణంతో.. డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలు డీలా పడ్డాయి. దీంతో తమిళనాడులో పాగా వేయడానికి ఇదే సరైన తరుణమని బీజేపీ భావిస్తోంది. పార్టీకి ఉపయోగపడతాడనే ఉద్దేశంతో.. నిజాయతీపరుడైన అధికారిగా పేరొందిన అన్నామలైను చేర్చుకుంది.
By August 30, 2020 at 09:49AM
No comments