వైసీపీ ఎమ్మెల్యే పేరుతో మోసం.. క్లియరెన్స్ కోసం రూ.35 లక్షల డిమాండ్

ప్రముఖులు, ప్రజాప్రతినిధుల పేర్లతో ప్రజలను బురిడీ కొట్టిస్తున్న ఉదంతాలు తెలుగు రాష్ట్రాల్లో పెరిగిపోయాయి. తాజాగా జిల్లా సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి అనుచరుడినని ప్రచారం చేసుకున్న ఓ వ్యక్తి వ్యాపారానికి క్లియరెన్స్లు కావాలంటే రూ.35 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసిన వ్యవహారం కలకలం రేపుతోంది. కాకినాడ పోర్టులో కాలం చెల్లిన ఏడు వెసల్స్ నుంచి పాత ఇనుమును విజయవాడ, కాకినాడ, రాజమహేంద్రవరం ప్రాంతాల వ్యాపారులు వేలం ద్వారా దక్కించుకున్నారు. ఈ క్రమంలోనే కాకినాడకు చెందిన కరీముల్లా అనే వ్యక్తి బుధవారం వారిని కలిశాడు. Also Read: తాను ఎమ్మెల్యే చంద్రశేఖర్ అనుచరుడినని, వేలంలో పొందిన ఇనుము తీసుకెళ్లేందుకు తాను అనుమతులు ఇప్పిస్తానని, అందుకు గాను రూ.35 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో వ్యాపారులు ఈ విషయాన్ని ఎమ్మెల్యే అనుచరుల దృష్టికి తీసుకు వెళ్లడంతో కరీముల్లా మోసం బయటపడింది. ఈ వ్యవహారంలో ఎమ్మెల్యేకు ఎటువంటి సంబంధం లేదని వారు చెప్పడంతో వ్యాపారులు ఆ వ్యక్తిపై కాకినాడ పోర్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సీఐ పి.శ్రీనివాసరావు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. Also Read:
By August 28, 2020 at 09:03AM
No comments