తమ్ముడి నమ్మకద్రోహం.. ఆస్తి కోసం అన్న ఆత్మహత్య

ఆస్తి కోసం ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన జిల్లా శాంతిపురం మండలం గుంజార్లపల్లెలో గురువారం జరిగింది. గుంజార్లపల్లెకు చెందిన బాలకృష్ణప్ప, నారాయణమ్మ దంపతులకు రాజన్న, ఆనంద్ అనే ఇద్దరు కుమారులున్నారు. ఇద్దరికీ వివాహాలు కావడంతో చాలా రోజుల క్రితమే విడిగా కాపురం ఉంటున్నారు. తండ్రి ఆస్తిని సమానంగా పంచుకున్నారు. అయితే రాజన్నకు రావాల్సిన తల్లి పేరిట ఉన్న ఆస్తిని ఆయనకు తెలియకుండా ఆనంద్ తన భార్య పేరుమీద ఆన్లైన్లో రికార్డ్ చేయించాడు. Also Read: ఈ విషయం తెలుసుకున్న రాజన్న తన ఆస్తిని ఇచ్చేయాలని తమ్ముడిని ఎన్నోసార్లు అడుగుతూ ఉన్నాడు. అయితే ఆనంద్ మాత్రం ఇచ్చేది లేదని తేల్చి చెప్పాడు. ఆస్తి వివాదంపై పెద్ద మనుషుల మధ్య పంచాయతీ జరిగినా సమస్య పరిష్కారం కాలేదు. దీంతో మనస్తాపం చెందిన రాజన్న బుధవారం ఇంట్లోనే పురుగులు మందు తాగాడు. కుటుంబసభ్యులు వెంటనే అతడిని కుప్పం పీఈఎస్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం చనిపోయాడు. రాళ్లబూదుగూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. Also Read:
By April 03, 2020 at 10:38AM
No comments