Breaking News

ఐదు నెలల గర్భిణి అనుమానాస్పద మృతి.. భర్త అరెస్ట్


తమిళనాడులో ఐదు నెలల గర్భిణి అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఘటన తీవ్ర విషాదం నింపింది. పళ్లిపట్టు ప్రాంతంలోని నెడియం దళితవాడకు చెందిన వరప్రసాద్(24) అనే యువకుడు ట్యాక్సీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన కార్తీక(21) చెంగల్పట్టులోని ఓ కాలేజీలో డిగ్రీ ఫస్టియర్ చదివేది. రోజూ కాలేజీకి వెళ్లొచ్చే క్రమంలో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడి ప్రేమకు దారితీసింది. పెద్దల అంగీకారంతో రెండేళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. Also Read: ప్రస్తుతం కార్తీక ఐదు నెలల గర్భవతి. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా మారడంతో వరప్రసాద్ శనివారం కోనేటంపేటలోని మండల ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లాడు. కార్తీకను పరీక్షించిన డాక్టర్లు అప్పటికే ఆమె చనిపోయినట్లు చెప్పారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని తిరుత్తణి ప్రభుత్వాస్పత్రికి తరిలించారు. తమ కూతురు మృతిపై అనుమానం ఉందని కార్తీక తండ్రి పళ్లిపట్టు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు వరప్రసాద్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తిరుత్తణి ఆర్డీఓ ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు. Also Read:


By March 23, 2020 at 11:00AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/5-months-pregnant-suspicious-dead-in-tamil-nadu-husband-arrested/articleshow/74768626.cms

No comments