Breaking News

భారత్‌లో 498 కరోనా కేసులు.. ఒక్క రోజే 99 కేసులు, దూకుడు పెంచిన కోవిడ్


భారత్‌లో వేగంగా విస్తరిస్తోంది. గతంతో పోలిస్తే కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. సోమవారం ఒక్క రోజే దేశంలో 99 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. దీంతో భారత్‌లో కోవిడ్ బారిన పడిన వారి సంఖ్య 500కు చేరువైంది. రాష్ట్రాల్లో 498 కేసులు నమోదు కాగా.. గత మూడు రోజుల్లోనే కొత్తగా 246 మందికి కరోనా నిర్ధారణ కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. దేశంలో 478 మందికి కరోనా సోకినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. వీరిలో 40 మంది విదేశీయులు ఉన్నారని తెలిపింది. కరోనా బారిన పడి ఇప్పటి వరకూ మన దేశంలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. సోమవారం కోల్‌కతాలో ఒకరు, హిమాచల్ ప్రదేశ్‌లో మరొకరు చనిపోయారు. సోమవారం కేరళలో 28 నూతన కేసులు నమోదు కాగా.. మహారాష్ట్రలో 23 కేసులు నమోదయ్యాయి. కరోనా కేసుల సంఖ్య వేగంగా పెరుగుతుండటంతో కేరళ లాక్‌డౌన్ ప్రకటించగా.. మహారాష్ట్రలో 144 సెక్షన్ అమల్లోకి వచ్చింది. గుజరాత్‌లో 12 కొత్త కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. సోమవారం 15 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కోవిడ్ కేసులు నమోదయ్యాయి. హిమాచల్ ప్రదేశ్‌లో ముగ్గురికి కరోనా సోకగా.. మరొకరు చనిపోయారు. తెలంగాణలో కోవిడ్ కేసుల సంఖ్య 33కి చేరిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకూ 35 మంది కోవిడ్ బారి నుంచి కోలుకోవడం.. మాత్రం కేసుల సంఖ్య వేగంగా పెరుగుతున్న వేళ కచ్చితంగా ఊరటనిచ్చే పరిణామం. వీరందర్నీ డిశ్చార్జ్ చేశామని ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. కరోనా నుంచి కోలుకున్న వారిలో హైదరాబాద్, నెల్లూరుకు చెందిన వ్యక్తులు కూడా ఉన్న సంగతి తెలిసిందే. ఇంటికే పరిమితం కావడం, సామాజిక దూరం పాటించడం వల్ల కరోనా కేసుల సంఖ్యను 62 శాతం వరకు తగ్గించొచ్చని.. తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటితో పోలిస్తే కేసుల సంఖ్యను 89 శాతం వరకు తగ్గించగలమని ఐసీఎంఆర్ తెలిపింది. కరోనా లక్షణాలు కనిపించని వారిని కనీసం 75 శాతం మందిని గుర్తించగలిగితే కరోనా వేగంగా వ్యాప్తి చేయకుండా అడ్డుకోగలమని తెలిపింది. కరోనా లక్షణాలు కనిపించని 90 శాతం మందిని గుర్తించగలిగితే.. ఈ వ్యాధి సగటు సమయాన్ని 20 రోజులకు వాయిదా వేయగలమని ఐసీఎంఆర్ అంచనా వేసింది.


By March 24, 2020 at 07:17AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/coronavirus-cases-in-india-close-to-500-total-now-498-and-death-toll-at-9/articleshow/74784397.cms

No comments