Vijayawada: ప్రియురాలు తిట్టిందని యువకుడి ఆత్మహత్య

ప్రేమించిన యువతి నిరాకరించిందన్న మనస్తాపంతో యువకుడు చేసుకున్న ఘటన విజయవాడలోని అజిత్సింగ్ నగర్లో జరిగింది. లెనిన్ కూడలికి చెందిన మన్నం సురేష్ ఓ ఫార్మా కంపెనీలో ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్నాడు. స్థానికంగా ఉండే ఓ యువతిని ప్రేమించాడు. గురువారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఆమె ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో ఆమె ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఇప్పుడెందుకు వచ్చాయని నిలదీసింది. Also Read: నీతో మాట్లాడాలని సురేశ్ చెప్పినా ఆమె వినకుండా వెళ్లిపోవాలని సూచించింది. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. మనస్తాపం చెందిన సురేశ్ ఇంటికి వెళ్లి మత్తు పదార్థం మింగేశాడు. అపస్మాకరస్థితికి చేరుకున్న అతడిని కుటుంబసభ్యులు సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ చనిపోయాడు. Also Read: సురేశ్ మృతికి యువతి వేధింపులే కారణమని అతడి బంధువులు ఫిర్యాదు చేయగా, తాను ఒంటరిగా ఉన్న సమయంలో సురేశ్ తన ఇంటికి వచ్చి వేధింపులకు పాల్పడ్డాడని యువతి కూడా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు సురేశ్ది అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. Also Read:
By November 09, 2019 at 08:07AM
No comments