Breaking News

అఫైర్ పెట్టుకున్నాడని.. రియల్ ఎస్టేట్ వ్యాపారిని చంపేసిన భార్య, కుమారుడు


తమిళనాడులోని కరూర్ జిల్లా కె.పరమత్తి ప్రాంతంలో పారిశ్రామికవేత్త దహనం కేసును పోలీసులు చేధించారు. వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడన్న కోపంతో భార్య, కుమారుడే అతడిని చంపి కారులో వేసి దహనం చేసినట్లు పోలీసులు విచారణలో తేలింది. Also Read: బుధవారం కె.పరమత్తి సమీపంలో కుప్పం– వేలమ్‌పాలైయమ్‌ మార్గంలో రోడ్డుపక్కన ఓ కారు కాలిపోయింది. అందులో మనిషి ఉన్నట్లు గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు కారులో ఉన్న మృతదేహాన్ని వెలికితీసి ఆస్పత్రికి తరలించారు. కారు నంబర్ ఆధారంగా విచారణ చేపట్టగా మృతుడు నొయ్యల్ ప్రాంతానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి రంగస్వామి(51) అని తేలింది. Also Read: దీంతో పోలీసులు అతడి ఇంటికి వెళ్లి వచారణ చేపట్టారు. అతడి భార్య కవిత, కుమారుడు అశ్విన్ పొంతనలేని సమాధానాలు చెప్పడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. దీంతో వారిని అదుపులోకి తీసుకుని లోతుగా దర్యాప్తు చేయగా తామే చేసినట్లు అంగీకరించారు. రంగస్వామి వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని కుటుంబాన్ని పట్టించుకోవడం లేదని, అందుకే ఇద్దరం ఇంట్లోనే అతడి గొంతు నులిమి చంపేశామని తెలిపారు. ఆ తర్వాత కారులో కె.పరమత్తి ప్రాంతానికి తీసుకెళ్లి నిప్పు పెట్టి వచ్చేశామని పోలీసులకు చెప్పారు. దీంతో షాకైన పోలీసులు నిందితులపై హత్య కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. Also Read:


By November 08, 2019 at 10:58AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/tamilnadu-businessman-killed-by-wife-son-over-illegal-affair/articleshow/71966150.cms

No comments