సమాధి నుంచి వెలికితీసి మహిళ శవంపై అత్యాచారం

పాకిస్థాన్లో అత్యంత దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. లోథీ పట్టణంలోని ఓ శ్మశానంలో పూడ్చిపెట్టిన మహిళ శవాన్ని వెలికితీసి అత్యాచారానికి పాల్పడటం కలకలం రేపింది. లోథీ పట్టణానికి చెందిన ఓ మహిళ అనారోగ్యంతో చనిపోవడంతో శనివారం స్థానిక ఇస్మాయిల్ గోత్ శ్మశానవాటికలో ఖననం చేశారు. ఆదివారం ప్రార్థనలు చేసేందుకు ఆమె సమాధి వద్దకు వెళ్లిన కుటుంబసభ్యులు, బంధువులు షాకయ్యారు. Also Read: ఆమెను ఖననం చేసిన చోట మట్టి తవ్వేసి ఉండటం, మృతదేహం బయటపడి ఉండటం చూసి అంతా కంగుతిన్నారు. మృతదేహంపై అత్యాచారం జరిగినట్లు నిర్ధారించుకుని కాటికాపరిని నిలదీశారు. తనకేమీ తెలీదని ముందు బుకాయించిన అతడు.. తర్వాత ఓ కుక్క వచ్చి మట్టి తవ్విందని చెప్పాడు. అయితే సమాధి మీద పెద్ద బండరాయి పెడితే కుక్క ఎలా తవ్విందని ప్రశ్నించగా నీళ్లు నమిలాడు. Also Read: దీనిపై మృతురాలి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇది తెలిసిన వారి పనేనని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. మరోవైపు కాటికాపరి పరారీలో ఉండటంతో అతడిపైనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తే నిజానిజాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు చెబుతున్నారు. దేశంలో చనిపోయిన మహిళకే రక్షణ లేనప్పుడు మిగిలిన వారి పరిస్థితి ఏమిటని అక్కడి ప్రజలు ఆందోళన పడుతున్నారు. Also Read:
By November 07, 2019 at 08:34AM
No comments