Breaking News

ఉత్తర కొరియా అణు పరీక్షలతో అరమీటరకు ఎత్తుకు పర్వతం.. ఇస్రో స్టడీలో ఆసక్తికర విషయాలు!


రెండేళ్ల కిందట అమెరికా- మధ్య కొనసాగిన మాటల యుద్ధంతో ప్రపంచ దేశాలు ఒకింత ఆందోళనకు గురయ్యాయి. ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ ప్రకటనలతో అణు యుద్ధం తప్పదేమోననే భావన వ్యక్తమైంది. వరుస అణు పరీక్షలతో అమెరికా, జపాన్, దక్షిణ కొరియాలను రెచ్చగొడుతూ కిమ్ జోంగ్ కయ్యానికి కాలుదువ్వారు. నాడు కిమ్ జోంగ్ చేపట్టిన అణు పరీక్షలు అసాధారమైనవి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ () అధ్యయనంలో వెల్లడయ్యింది. ఉత్తర కొరియా 2017లో ఐదుసార్లు నిర్వహించిన అణు పరీక్షలు నిర్వహించింది. ఈ అణు పరీక్షలు రెండో ప్రపంచ యుద్ధ సమయంలో హిరోషిమాపై ప్రయోగించిన ‘లిటిల్‌ బాయ్‌’ కంటే 17 రెట్లు అధికమని ఇస్రోకు చెందిన స్పేస్‌ అప్లికేషన్‌ సెంటర్‌ అధ్యయనంలో తేలింది. ఉత్తర కొరియా అణు పరీక్షలపై స్పేస్ అప్లికేషన్ సెంటర్‌ కేఎం శ్రీజిత్‌ బృందం అధ్యయనం చేపట్టింది. ఎస్ఏసీకి చెందిన జియో-సైనెన్స్ విభాగానికి చెందిన రితేశ్ అగర్వాల్, ఏఎస్ రాజావత్ ఈ స్టడీలో పాల్గొన్నారు. ఈ అధ్యయన నివేదికను జియోఫిజికల్ జర్నల్ ఇంటర్నేషనల్‌లో ప్రచురించారు. సాధారణంగా అణ్వస్త్ర పరీక్షల ఫలితాలను సిస్మోగ్రాఫ్‌పై నమోదయ్యే తీవ్రత ఆధారంగా లెక్కిస్తారు. అయితే, జపాన్‌కు చెందిన ఆలోస్‌-2 ఉపగ్రహం అందించిన వివరాలు, ఇన్సాప్‌ రాడార్‌ చిత్రాలను విశ్లేషించారు. అణు పరీక్షల నిర్వహించేటప్పుడు ఆ ప్రాంతంలోని ఉపరితలంపై మార్పుల ఆధారంగా దాని తీవ్రతను అంచనా వేశారు. అణు నిరాయుధకరణ ఒప్పందం 2003 నుంచి వైదొలగిన ఉత్తర కొరియా 2017లో వరుసగా ఐదు పర్యాయాలు అణ్వస్త్ర పరీక్షలను నిర్వహించింది. 2017 సెప్టెంబరు 3న నిర్వహించిన పరీక్షను థర్మోన్యూక్లియర్ పరీక్షగా నిర్ధరించారు. ఉత్తర కొరియా ఈశాన్య ప్రదేశంలోని మంటాప్‌ పర్వతం వద్ద ఉత్తరకొరియా అణు పరీక్షలను నిర్వహించిందని, విస్ఫోటనం జరిగినచోట భూభాగం కొన్ని మీటర్లు స్థానచలనం చెందిందని తెలిపారు. పర్వత శిఖరం అరమీటరు ఎత్తుకు వెళ్లి, ఈ పేలుడు ధాటికి 66 మీటర్ల లోతైన గుంత ఏర్పడిందని పరిశోధకులు పేర్కొన్నారు. అణు పరీక్షలను మంతాప్ పర్వతానికి ఉత్తరాన 2.5 కిలోమీటర్ల పొడవు, 540 మీటర్ల లోతైన సొరంగంలో నిర్వహించినట్టు ఉపగ్రహం తీసిన ఛాయ చిత్రాలు ఆధారంగా విశ్లేషించామని తెలిపారు. ఈ ప్రయోగానికి 245 నుంచి 271 కిలోటన్నుల వరకు అణ్వాయుధాలను వినియోగించారని, ఇది హిరోషిమా నగరంపై రెండో ప్రపంచ యుద్ధ కాలంలో ప్రయోగించిన లిటల్ బాయ్ కంటే 17 రెట్లు అధికమని తేల్చారు. కాగా, పొరుగుదేశాల అణు పరీక్షలపై పూర్తి సమాచారం అందజేసే అలోస్-2 తరహా శాటిలైట్‌ను భారత్ కూడా నాసా సాయంతో 2022లో ప్రయోగించనుంది.


By November 16, 2019 at 12:52PM


Read More https://telugu.samayam.com/latest-news/science-technology/isros-space-application-centre-study-on-north-korean-nuclear-tests-in-2017/articleshow/72082594.cms

No comments