Breaking News

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ భర్తపై కేసు నమోదు


ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి భర్త భార్గవ్‌రామ్‌ చిక్కుల్లో పడ్డారు. వ్యాపార భాగస్వామిపై దాడికి పాల్పడిన ఘటనలో కర్నూలు జిల్లా పోలీసులు ఆయనపై కేసు నమోదుచేశారు.. జిల్లాలోని దొర్నిపాడు మండలం కొండాపురానికి చెందిన శివరామిరెడ్డి అనే వ్యక్తి ఆళ్లగడ్డ పట్టణ శివారులో శ్రీలక్ష్మీ ఇండస్ట్రీస్ పేరుతో క్రషర్ ఫ్యాక్టరీ ఉంది. ఇందులో అఖిలప్రియకు 40శాతం వాటా ఉంది. దీంతో పాటు మరో పరిశ్రమను కూడా శివరామిరెడ్డి నిర్వహిస్తున్నారు. Also Read: ఈ క్రమంలో అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్ తన భర్తపై హత్యాయత్నం చేసినట్లు శివరామిరెడ్డి భార్య మాధవీలత ఆళ్లగడ్డ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సెప్టెంబర్ 14వ తేదీన భార్గవ్‌రామ్, అతడి అనుచరులు ఫ్యాక్టరీ వద్దకు వచ్చిన అక్కడున్న వారిని తరిమేసి తాళాలు వేశారని, 27వ తేదీన మరో పరిశ్రమను స్వాధీనం చేసుకుని రెండింటిని తమపేరిట రాసివ్వాలని డిమాండ్ చేశారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. Also Read: ఎదురు తిరిగిన తన భర్తపై హత్యాయత్నానికి పాల్పడ్డారని మాధవీలత పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో భార్గవ్‌రామ్‌తో పాటు మరో 10మందిపై ఆళ్లగడ్డ ఎస్ఐ రమేష్‌కుమార్ కేసు నమోదు చేశారు. వీరిలో మహేశ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశామని, సమగ్ర దర్యాప్తు చేసిన తర్వాత భార్గవ్‌రామ్‌పై చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. Also Read:


By October 03, 2019 at 08:54AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/allagadda-police-filed-case-against-bhuma-akhilapriya-husband/articleshow/71416713.cms

No comments