Breaking News

లైంగిక కోరిక తీర్చలేదని... స్టూడెంట్‌ను కాల్చి చంపిన టీచర్


విద్యార్థులను కన్నబిడ్డల్లా చూసుకోవాల్సిన ఉపాధ్యాయుడు కీచకుడిగా మారాడు. తన కోరిక తీర్చలేదన్న కక్షతో పాటు, ఉద్యోగం పోవడానికి కారణమైందన్న ఆక్రోశంతో 8వ తరగతి విద్యార్థినిని తుపాకీతో కాల్చి చంపేశాడు. ఈ దారుణ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పూర్‌లో కలకలం రేపింది. Also Read: కాన్పూర్‌‌కి చెందిన శైలేంద్ర రాజ్‌పుత్‌ అనే వ్యక్తి స్థానికంగా ఓ ప్రైవేటు స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తున్నాడు. అదే స్కూల్‌లో 8వ తరగతి చదువుతున్న ఓ బాలికపై కన్నేసి లైంగికంగా వేధిస్తున్నాడు. ఈ విషయాన్ని బాధితురాలు తల్లిదండ్రులకు చెప్పడంతో వారు స్కూల్ యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. విచారణలో శైలేంద్ర తప్పు చేసినట్లు తేలడంతో అతడిని మూడు నెలల పాటు ఉద్యోగంలో నుంచి తీసేశారు. Also Read: దీంతో విద్యార్థినిపై కక్ష పెంచుకున్న శైలేంద్ర ఆమెను చంపేయాలని నిర్ణయించుకున్నాడు. గురువారం సాయంత్రం స్కూల్‌ నుంచి ఇంటికి వెళ్తున్న ఆమెపై తుపాకీతో కాల్పులు జరిపాడు. తీవ్ర రక్తస్రావంతో విద్యార్థిని అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. దీంతో నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానికులు బాలికను వెంటనే ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయింది. ఈ ఘటనపై బాలిక బంధువులు, స్థానికులు ఆందోళన చేశారు. పోలీసులు శైలేంద్రపై హత్య కేసు నమోదు చేసి అతడి కోసం గాలిస్తున్నారు. Also Read:


By October 27, 2019 at 01:23PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/kanpur-minor-girl-killed-by-class-teacher-due-to-refusing-sexual-favour/articleshow/71783662.cms

No comments