నదిలోకి దూసుకెళ్లిన బస్సు... ఆరుగురి మృతి, 19మందికి గాయాలు

మధ్యప్రదేశ్లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఇండోర్ నుంచి ఛత్రపూర్ వెళ్తున్న ప్రైవేటు బస్సు బుధవారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో అదుపుతప్పి నదిలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆరుగురు ప్రయాణికులు మృతిచెందగా, 19 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, రెండేళ్ల చిన్నారి ఉన్నారు. Also Read: ప్రమాద సమాచారం అందుకోగానే రెస్క్యూ టీమ్స్ హుటాహుటిన అక్కడికి చేరుకుని సహాయచర్యలు చేపట్టాయి. నదిలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో రక్షణ చర్యలకు ఆటంకం కలుగుతోందని అధికారులు చెబుతున్నారు. క్షతగాత్రులను బస్సులో నుంచి బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. Also Read: రైసేన్ కలెక్టర్ ఉమాశంకర్ భార్గవ్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి బాధితులను పరామర్శించారు. బస్సులో నుంచి 6 మృతదేహాలను వెలికితీశామని తెలిపారు. తీవ్రంగా గాయపడిన వారిన భోపాల్ ప్రభుత్వాసుపత్రికి, స్వల్పగాయాలైన వారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించినట్లు చెప్పారు. క్షతగాత్రులకు తక్షణ సాయంగా రూ.10వేలు అందజేస్తు్న్నట్లు తెలిపారు. ఈ ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు చేసి ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామన్నారు. Also Read:
By October 03, 2019 at 10:21AM
No comments