Breaking News

వేరే వ్యక్తితో వెళ్లిపోయిన చెల్లి.. నలుగురు అక్కల ఆత్మహత్యాయత్నం


తెలంగాణలోని జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు యువతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది. వీరంతా ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెబుతున్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల మండల పరిధిలోని గ్రామానికి చెందిన ఓ పేద దంపతులకు ఆరుగురు ఆడపిల్లలున్నారు. పెళ్లీడు కొచ్చినా ఆర్థిక కష్టాల నేపథ్యంలో ఇంకా ఎవరికీ వివాహం కాలేదు. వీరిలో ఐదో అమ్మాయి బుధవారం నుంచి కనిపించకుండా పోయింది. దీంతో కుటుంబమంతా బంధువులు, స్నేహితుల ఇళ్లలో వెతికారు. ఆ యువతి ఓ యువకుడితో వెళ్లిపోయినట్లు స్నేహితులు చెప్పడంతో వారంతా మనస్తాపానికి గురయ్యారు. తమకంటే చిన్న వయసుది ఇంటి నుంచి వెళ్లిపోయి కుటుంబ పరువు తీసేసిందని, ఇంక తమకు పెళ్లిళ్లు ఎలా అవుతాయని మనస్తాపానికి గురైన నలుగురు అక్కలు గురువారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఇది గమనించిన తల్లి, చిన్న చెల్లి అమ్మాయిలను అడ్డుకోగా వారిని తోసేసి తలుపులు మూసుకున్నారు. దీంతో తల్లి కేకలు పెట్టడంతో చుట్టుపక్కల వారు వచ్చి తలుపులు పగులగొట్టి యువతులను బయటకు తీసుకొచ్చి బాదేపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి మహబూబ్‌నగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ముగ్గురు కోలుకోగా.. ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు చెప్పారు.


By June 28, 2019 at 08:53AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/four-young-women-suicide-attempt-in-mahabubnagar-district/articleshow/69983777.cms

No comments