Breaking News

‘సాహో’ నుంచి వారు ఎందుకు తప్పుకున్నట్టో?


యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ మూవీ సాహో. దాదాపు షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్న ఈ సినిమా రిలీజ్ డేట్ రీసెంట్ గా ప్రకటించారు. అంతా బాగానే ఉంది అనుకున్న టైములో ఫ్యాన్స్‌ని కంగారు పెట్టే ఓ వార్త బయటకి వచ్చింది. ఈసినిమా నుండి తాజాగా సంగీత దర్శకులు వైదొలిగారు.

ఈ విషయాన్ని సోషల్ మీడియాలో కన్ఫర్మ్ చేస్తూ శంకర్ – ఎహసాన్ – లాయ్ ద్వయం ఒక ట్వీట్ ని కూడా వేశారు. ‘‘సాహో చిత్రానికి సంబంధించిన స్వర కల్పనా బాధ్యతల నుండి శంకర్ ఎహసాన్ లాయ్ ద్వయం విరమించుకుంటుంది అని మా అభిమానులందరికీ తెలియజేస్తున్నాము. ఈ సందర్భంగా నిర్మాతలు వంశీ ప్రమోద్ మరియు డైరెక్టర్ సుజీత్ కి ఇవే మా శుభాకంక్షాలు’’ అని తమ ట్విట్టర్ అకౌంట్‌లో పేర్కొన్నారు. 

అయితే ఎందుకు వీరు ఈమూవీ నుండి తప్పుకోవాల్సి వచ్చిందో మాత్రం చెప్పలేదు. వీరి ప్లేస్ లో జిబ్రాన్, తమన్ లను తీసుకున్నారని టాక్.



By May 30, 2019 at 04:47AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/46125/saaho.html

No comments